కడప, 27 జూన్ (హి.స.)
,:వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి బైక్కు ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ అవుతుండగా బైక్లో పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో వాహనం పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు వెంకట లక్ష్మమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సాకేట్లో ఏమైనా సమస్య ఉందా? లేకుంటే బైక్లో సాంకేతిక లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు సైతం రంగంలోకి దిగారు. అలాగే ఈ బైక్ తయారీ సంస్థకూ ఘటనపై సమాచారం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ