భద్రాద్రి రామయ్యకు 9 కిలోల వెండి కవచాలను బహుకరించిన భక్తుడు
తెలంగాణ, భద్రాచలం. 27 జూన్ (హి.స.) భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. తన భక్తిభావాన్ని చాటుకుంటూ సుమారు రూ.12 లక్షల విలువైన వెండి కవచాలను స్వామివారికి కానుకగా అందజేశారు. వివరాల్లోకి వెళిత
భద్రాద్రి రామయ్య


తెలంగాణ, భద్రాచలం. 27 జూన్ (హి.స.)

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. తన భక్తిభావాన్ని చాటుకుంటూ సుమారు రూ.12 లక్షల విలువైన వెండి కవచాలను స్వామివారికి కానుకగా అందజేశారు. వివరాల్లోకి వెళితే… సంతోష్ కుమార్‌ రెడ్డి, సాహిత్య దంపతులు 9 కేజీల వెండితో సీతారామ లక్ష్మణులకు కవచాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. స్వామివారికి శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేసి వాటిని సమర్పించారు. భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఈ కానుకను ఆలయ అధికారులు స్వీకరించి, దాతకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande