తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
తిరుపతి, 4 జూన్ (హి.స.):తిరుమల )లో భక్తుల () రద్దీ కొనసాగుతోంది . వేసవి సెలవులు ) ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులతో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. సర
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది


తిరుపతి, 4 జూన్ (హి.స.):తిరుమల )లో భక్తుల () రద్దీ కొనసాగుతోంది . వేసవి సెలవులు ) ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులతో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీవారి వారి దర్శనం కోసం మెట్ల మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు) కీలక నిర్ణయం ) తీసుకున్నారు. ఇప్పటి వరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త కౌంటర్లు ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande