శ్రీనివాసమంగాపురం 4 జూన్ (హి.స.)
: ప్రస్తుతం శ్రీవారిమెట్టు మార్గంలో కాలి నడక భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం(డీడీ) టోకెన్లను.. శుక్రవారం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు మార్చనున్నారు. ఈ మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ ప్రతిరోజు 5 వేల దివ్యదర్శన టోకెన్లను జారీ చేస్తోంది. ఇటీవల ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు దర్శన టోకెన్లు ఇప్పిస్తామని భక్తులను భారీగా దోచుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేసేలా టీటీడీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం శ్రీవారి మెట్టు నుంచి దివ్యదర్శన టోకెన్ల కౌంటర్లను శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మార్చాలని నిర్ణయించారు.
అనుమతి కోసం కేంద్ర ఆర్కియాలజీ విభాగానికి లేఖ రాశారు. వారి నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో టోకెన్ల జారీని ప్రస్తుతం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు(ఎ్సఎ్సడీ) జారీ చేస్తున్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారు. శనివారం దర్శనానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్లో డీడీ టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా శ్రీవారిమెట్టు మార్గంలోని 1,200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలి. ఇదే అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం సాయంత్రం అధికారులతో వర్చువల్గా సమీక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ