తెలంగాణ, సూర్యాపేట. 9 జూన్ (హి.స.)
ఆర్టీసీలో ప్రయాణించిన
మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పేరిట మహిళలు ఉచిత ప్రయాణం చేసినా ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 6,088 కోట్ల డబ్బులు చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు పూర్తి సామర్థ్యంత నడుస్తున్నాయని అందువల్లో ఆర్టీసీ నిలదొక్కుకుందన్నారు.
సోమవారం సూర్యాపేటలో ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను భట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, ఉత్తమ్ పద్మావతి, మందుల సామేల్ తదితరులు హాజరయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు