అమరావతి, 9 జూన్ (హి.స.)
తాడేపల్లి: మంగళగిరిలోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళా రైతులు ధర్నా చేపట్టారు. రాజధాని రైతులు, మహిళల పట్ల జర్నలిస్టు కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. పలువురు మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకొని సాక్షి కార్యాలయం ప్రధాన గేటు దగ్గరికి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ