న్యూఢిల్లీ, 3 జూలై (హి.స.)
నేషనల్ హెరాల్డ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.2 వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్షీట్లో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే. దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..