
అమరావతి, 02 మార్చి (హి.స.)
పెదపాడు: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట ఎఫ్సీఐ గోడౌన్స్ సమీపంలో జరిగింది. ఏలూరు బీడీ కాలనీకి చెందిన ఈ ముగ్గురూ కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ