అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయంపై ఇరాన్ దాడి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.
అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయంపై ఇరాన్ దాడి


ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.

బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయంపై ఇరాన్ దాడి చేసినట్లు

ఫైనాన్షియల్ టైమ్స్ను ఉటంకిస్తూ రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ దాడి

తర్వాత ఓ కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయని,

వాటిని అదుపులోకి తెచ్చామని బహ్రెయిన్ అంతర్గత

వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అయితే, ఆ కంపెనీ పేరును

గానీ, నష్టం

వివరాలను గానీ వెల్లడించలేదు.

అమెరికా,

ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలో

అమెజాన్, యాపిల్, టెస్లా వంటి

అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించిన

మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై అమెజాన్ ఇంకా అధికారికంగా

స్పందించలేదు. అయితే, గతవారమే ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా తమ అమెజాన్

వెబ్ సర్వీసెస్ (AWS)కు అంతరాయం కలిగిందని కంపెనీ అంగీకరించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande