భారత్పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం!
భారత్పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం!
మునీర్


న్యూఢిల్లీ, 04 మే (హి.స.)

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, భారత్పై సరికొత్త కుట్రపూరిత వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తన దేశంలో తెహ్రీక్-ఏ-తాలిబన్ (టీటీపీ), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జరుపుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్థాన్ స్వయంకృతాపరాధమే ఈ సమస్యలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా, మునీర్ ఈ ప్రచారాన్ని ఉధృతం చేయడం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలను మళ్లీ భారత్పై దాడులకు ఉసిగొల్పడమే ఆయన అసలు ఉద్దేశం.

'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ సైన్యం పరువు కోల్పోవడంతో, ఆసిమ్ మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్కు ముందు, భారత్ను తూర్పు నుంచి నాశనం చేయడం ప్రారంభిస్తాం అంటూ ఆయన గంభీరమైన ప్రకటనలు చేశారు. అయితే, ఆ ఆపరేషన్ విఫలమవడంతో ఇప్పుడు సొంత దేశంలో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ అవమానం నుంచి బయటపడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ భారత్పై నిందలు మోపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande