అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్
అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్
BJP State Parliamentary Board will take names from MLAs and corporators for the names of Mayor, the senate process will be held on May 2-3


అస్సాం, 04 మే (హి.స.)

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక నేత గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. సోమవారం జరుగుతున్న కౌంటింగ్లో ఐదో రౌండ్ ముగిసే సమయానికి, బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి 8,013 ఓట్ల భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి గోస్వామికి 23,339 ఓట్లు పోలవగా, గౌరవ్ గొగోయ్కు 15,326 ఓట్లు మాత్రమే వచ్చాయి. కీలకమైన ఈ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే వెనుకబడటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. తదుపరి రౌండ్లలో ఫలితం మారుతుందేమోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 98 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి కేవలం 25 నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజలో ఉంది.

అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా, 85.96 శాతం రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 722 మంది అభ్యర్థులు నిలవగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande