మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Sarsangachalak Mohan Bhagwat


ఫిరోజాబాద్, 12 జూన్ (హి.స.)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేతమోహన్ భగవత్ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది

ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు

నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలు

యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా పరిధిలోని మక్ఖన్పూర్ స్టేషన్ సమీపంలో గుండా

వెళ్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు విసిరిన రాళ్ల కారణంగా మోహన్ భగవత్

ప్రయాణిస్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ (E-1) కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది.

అయితే, ఆయన కిటికీకి అవతలి వైపు కూర్చోవడంతో ఎలాంటి గాయాలు కాకుండా

సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇతర ప్రయాణికులకు కూడా ఎటువంటి గాయాలు కాలేదని

అధికారులు ధృవీకరించారు.

రాళ్లదాడి సమాచారం అందిన వెంటనే

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి, రైలును తుండ్లా జంక్షన్ వెలుపల

నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆగ్రా జోన్

ADG ఎస్.కే. భగత్, డిఐజి శైలేష్ పాండే, ఫిరోజాబాద్ ఎస్పీ ఆదిత్య లాంఘే

స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును పర్యవేక్షించారు. ఘటనా స్థలంలోని

సీసీటీవీ ఫుటేజీలను మరియు ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఇద్దరు

అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే భద్రతను విఘాతం

కలిగించే ఇలాంటి చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు

స్పష్టం చేశారు. భద్రతా తనిఖీల అనంతరం రైలును సురక్షితంగా ఢిల్లీకి పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande