
హైదరాబాద్, 13 జూన్ (హి.స.)హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్
ఫోర్స్ అకాడమీ (AFA)లో జరిగిన 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్
పరేడ్ (CGP)కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై
ప్రసంగించారు.శనివారం జరిగిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలో రివ్యూయింగ్ ఆఫీసర్గా
వ్యవహరించిన ఆయన, కఠినమైన ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ శిక్షణను
విజయవంతంగా పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లకు అధికారికంగా కమిషన్ హోదాలను
ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్
సింగ్ కొత్తగా విధుల్లోకి చేరిన యువ సైనిక అధికారుల దుస్తులపై 'వింగ్స్', 'బ్రెవెట్లను' అలంకరించారు. అలాగే గ్రౌండ్
డ్యూటీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు రాష్ట్రపతి పతకాన్ని
అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు
అనుగుణంగా సరికొత్త వైమానిక సాంకేతికతలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహాలను అందిపుచ్చుకోవాలని
క్యాడెట్లకు పిలుపునిచ్చారు. భారతీయ ఆకాశ సరిహద్దులను కాపాడటంలో ఎల్లప్పుడూ
అత్యున్నత వ్యూహాత్మక సన్నద్ధతను ప్రదర్శించాలని ఆయన కోరారు.
ఈ వేడుకలో భాగంగా ఇండియన్ ఎయిర్
ఫోర్స్ (IAF) శిక్షణా విమానాలైన పిలాటస్ PC-7 Mk II, కిరణ్, హాక్ ఫార్మేషన్లతో పాటు
అత్యాధునిక యుద్ధ విమానాలు ఆకాశంలో చేసిన సాహసాలు, 'సారంగ్' హెలికాప్టర్ ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్నేహపూర్వక విదేశాలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్లు కూడా
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈ పరేడ్లో ఎయిర్ చీఫ్ మార్షల్, ఇతర ఉన్నత స్థాయి రక్షణ
అధికారులు మరియు క్యాడెట్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi