
చెన్నై, 10 జూలై (హి.స.)
చైన్నైలో శుక్రవారం గాలివాన బీభత్సం
సృష్టించింది. చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావం వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 10 విమానాలు ల్యాండింగ్ అవ్వలేక గాలిలోనే చక్కర్లు కొట్టాయి. వాతావరణం అనుకూలించిన తరవాత అవన్నీ సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరికి సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సాధరణమే. ఇలాంటి సమయాల్లో పైలెట్ లు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు తప్పే అవాకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..