ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో ప్రధాన రహదారులు
దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన కుండపోత వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తూ నీట మునిగాయి.
Drizzling rain in Ahmedabad,


ఢిల్లీ, 23 ఆగస్టు (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన కుండపోత వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి (heavy rain) ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తూ నీట మునిగాయి. దీంతో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉదయం వేళల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా ప్రజా రవాణా వైపు మళ్లడంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి తీవ్ర రద్దీ నెలకొంది.

రాబోయే మరో 24 గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రాఫిక్ ఇబ్బందులు, వర్ష తీవ్రత దృష్ట్యా ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు తక్షణమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) సౌకర్యం కల్పించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నగర పాలక సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని భారీ మోటార్ల ద్వారా వేగంగా తొలగిస్తూ ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande