
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి (2047) దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా, సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ఈ రెండ్రోజుల సదస్సు ప్రధాన లక్ష్యం. మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు దేశంలోని వివిధ ప్రముఖ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (వీసీలు), విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు మరియు పరిశోధకులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా రాబోయే రెండు దశాబ్దాలలో దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవడం, ఉపాధి అవకాశాల కల్పన మరియు గ్రామీణాభివృద్ధిపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలు, పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై వివిధ సెషన్లలో నిపుణులు తమ ప్రసంగాలను, పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసేలా రూపొందించిన ఈ సదస్సు ముగింపులో 2047 లక్ష్యాల సాధనకు సంబంధించిన ఒక సమగ్ర నివేదికను రూపొందించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi