
- భాషా సమాగమ్-2026: భారతీయ జ్ఞాన సంప్రదాయ వారధికి అనుసంధాన కేంద్రంగా కాశీ
-హిందుస్థాన్ సమాచార్ చొరవతో భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని వారసత్వానికి అనుసంధానించి, భావితరాలకు అందించడం అత్యంత కీలకం: డా. కులదీప్ చంద్ అగ్నిహోత్రి
వారణాసి, సెప్టెంబర్ 13 (హిందుస్థాన్ సమాచార్): భారతదేశపు ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక జ్ఞానానికి మధ్య ఒక పెద్ద గోడ ఏర్పడిందని హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ కులపతి డా. కులదీప్ చంద్ అగ్నిహోత్రి తెలిపారు. నేడు మనముందున్న అతిపెద్ద సవాలు ఈ గోడను బద్దలు కొట్టి, రెండు జ్ఞాన ధారలను కలపడమేనని అన్నారు. మనం ఆరు వేల లేదా పది వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేదని, మన ప్రాచీన జ్ఞాన సంప్రదాయాన్ని నేటి విజ్ఞాన శాస్త్రం, విద్యతో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. దీనివల్ల సనాతన జ్ఞాన ప్రవాహం ముందుకు సాగుతుందని, దేశానికి సరికొత్త ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ గాంధీ అధ్యయన పీఠ్ సభాభవనంలో హిందీ దినోత్సవ పూర్వ సంధ్య సందర్భంగా బహుభాషా వార్తా సంస్థ 'హిందుస్థాన్ సమాచార్' ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించినజ్ భారతీయ జ్ఞాన సంప్రదాయం, ప్రాంతీయ భాషలు మరియు సమృద్ధ భారత్అనే అంశంపై జరిగిన 'భారతీయ భాషా సమాగమ్-2026'లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసన్సించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని కేవలం తత్వశాస్త్రం, ఆత్మ, పరమాత్మలకే పరిమితం చేయడం దాని విశాల రూపాన్ని కుదించడమే అవుతుందని పేర్కొన్నారు. భారత్ గణితం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, వైద్య శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంతో సహా పలు రంగాలలో అద్భుతమైన జ్ఞానాన్ని ఆర్జించిందని చెప్పారు. ఆ జ్ఞానాన్ని వెలికితీసి, అర్థం చేసుకుని, ఆధునిక కోణంలో దానిని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
కాశీ ఇకపై కేవలం ఆస్థా, ఆధ్యాత్మిక నగరమే కాదని, భారతీయ జ్ఞాన సంప్రదాయానికి, ఆధునిక జ్ఞానానికి మధ్య తెగిపోయిన వారధిని కలిపే కేంద్రంగా మారుతుందని తెలిపారు. ప్రాచీన జ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో జోడించి కొత్త తరానికి అందించే గొప్ప ప్రయోగానికి కాశీ వేదిక కావాలని ఆకాంక్షించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయ పునరుజ్జీవనానికి సంబంధించిన నూతన ధార దేశమంతా ప్రవహించడానికి ఇదే సరైన భూమి అని చెప్పారు.
జ్ఞాన వారధిలో కీలక పాత్ర పోషించనున్న భాష
భారతీయ జ్ఞాన సంప్రదాయానికి సంబంధించిన అనేక పాళీలు, హస్తప్రతులు (పాండలిపిలు) సంస్కృతంలో ఉన్నాయని, అయితే ఆధునిక విషయ నిపుణులకు సంస్కృతంతో తగిన పరిచయం లేదని డా. అగ్నిహోత్రి తెలిపారు. ఫిజిక్స్ ప్రొఫెసర్కు సంస్కృతం రాకపోవడం, సంస్కృత పండితుడికి ఫిజిక్స్ మీద అవగాహన లేకపోవడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాచీన జ్ఞాన వారసత్వాన్ని చేరుకోవడానికి ఇరువర్గాల మధ్య ఒక సంభాషణ వారధిని నిర్మించాలని స్పష్టం చేశారు.
భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని ప్రస్తుత విద్యా వ్యవస్థలో విలీనం చేయడానికి భాషా, విషయ నిపుణులు ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. విశ్వవిద్యాలయాలలో సిలబస్లో భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని చేరుస్తున్నామని చెబుతున్నప్పటికీ, కేవలం సిలబస్ తయారు చేయడం వల్లనే ఆశయం నెరవేరదని అన్నారు. ఆయా రంగాలలో భారతదేశపు విజయాలు ఏమిటో ప్రతి సబ్జెక్టులోనూ వెతుకవలసి ఉంటుందని తెలిపారు.
కెమిస్ట్రీ ప్రొఫెసర్కు భారతీయ రసాయన సంప్రదాయం అర్థం కావాలంటే, వారు సంబంధిత ప్రాచీన గ్రంథాలను పరిశీలించాల్సి ఉంటుందని ఒక ఉదాహరణ ద్వారా ఆయన వివరించారు. దీనికోసం సంస్కృత పండితులు, సైన్స్ నిపుణులు కలిసికట్టుగా శ్రమించాలని సూచించారు.
కాశీలో జ్ఞాన రంగంలో కొత్త ప్రయోగాలు జరగాలి
జ్ఞాన రంగంలో కాశీ సరికొత్త ప్రయోగాలు చేయాలని మాజీ వైస్ ఛాన్సలర్ అభిప్రాయపడ్డారు. ఆంగ్ల విద్యా విధానం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో మహామనా మడన్ మోహన్ మాలవ్య కాశీలో ఒక గొప్ప విద్యా ప్రయోగాన్ని చేశారని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ గుజరాత్లో విద్యాపీఠ్ను స్థాపించగా, స్వామి శ్రద్ధానంద్ గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని, లాలా లజపతిరాయ్ లాహోర్లో నేషనల్ కాలేజీని స్థాపించారని తెలిపారు. ఆ కాలంలో భారతీయ విద్యను, జ్ఞాన సంప్రదాయాన్ని రక్షించడానికి అటువంటి ప్రయోగాలు జరిగాయని చెప్పారు.
నేడు మళ్లీ అలాంటి ప్రయోగాల అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కాశీలో కారిడార్ ఏర్పాటయ్యిందని, అయితే జ్ఞాన రంగంలో కూడా ప్రాచీన జ్ఞానాన్ని వర్తమానంతో అనుసంధానించే ఒక 'జ్ఞాన కారిడార్' ఏర్పడాలని ఆకాంక్షించారు. 'హిందుస్థాన్ సమాచార్' ఈ దిశగానే అడుగులు వేస్తోందని ప్రశంసించారు. కాశీలోని మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి భారతీయ జ్ఞాన సంప్రదాయపు తెగిపోయిన వారధిని పునరుద్ధరించేలా ఒక చక్కటి వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు.
భాష కంటే అందులో చెప్పిన విషయమే ముఖ్యం
భారతీయ భాషల గురించి మాట్లాడుతూ.. భాష కంటే అందులో ఏం చెప్పారనేదే అత్యంత ముఖ్యమని డా. అగ్నిహోత్రి స్పష్టం చేశారు. కాశీ ఎప్పుడూ కూడా భాషకన్నా అందులోని సారాంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. గోస్వామి తులసీదాస్ జనబాషలోనే 'రామచరిత్రమానస్' కావ్యాన్ని రచించగా, సమాజం దానిని మనసారా స్వీకరించిందని, ఎందుకంటే అందులోని ఆలోచనలు అంత గొప్పవని తెలిపారు.
ఆంగ్ల భాషపై ఉన్న మానసిక ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్ప విద్వాంసుడని, స్వంత భాషలో మాట్లాడేవాడు తక్కువవాడని భావించే ఆలోచనా విధానం మారాలన్నారు. భారతదేశంలోని ప్రతి భాష కూడా జాతీయ ప్రాముఖ్యత కలిగినదేనని చెప్పారు. అస్సామీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, హిందీతో సహా అన్ని భారతీయ భాషలు మన దేశ జ్ఞాన, సాంస్కృతిక వారసత్వానికి వాహకాలని కొనియాడారు.
'భారతీయ భాషా దివస్'ను ప్రారంభించిన హిందుస్థాన్ సమాచార్
భారతీయ భాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే భావన బహుభాషా వార్తా సంస్థ 'హిందుస్థాన్ సమాచార్'కు సంబంధించినదని డా. అగ్నిహోత్రి వెల్లడించారు. హిందీని జాతీయ భాషగా పేర్కొంటున్న తరుణంలో అస్సామీతో సహా ఇతర భారతీయ భాషల స్థానం ఏమిటనే ప్రశ్న తలెత్తినప్పుడు.. భారతదేశంలోని అన్ని భాషలూ జాతీయ ప్రాముఖ్యత కలిగినవే అనే ఆలోచన ముందుకొచ్చిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో హిందుస్థాన్ సమాచార్ 'భారతీయ భాషా దివస్' వేడుకలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
రాష్ట్రభావం పరిరక్షణ కూడా అత్యంత ముఖ్యం
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాష్ట్రభావానికి (నేషనల్ సెంటిమెంట్) సంబంధించినదేనని డా. అగ్నిహోత్రి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని చూడవచ్చు కానీ దేశాన్ని (రాష్ట్రాన్ని) నేరుగా చూడలేమని, దేశం అనేది ప్రజల హృదయాలలో ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి, ఏర్పడుతుంటాయి కానీ దేశభావం నిలకడగా ఉన్నంతవరకు ఆ దేశం జీవించే ఉంటుందని తెలిపారు. నేడు సవాళ్లతో పాటు వాటి రూపాలు కూడా మారాయని, అందుకే జాతీయ భావాల పరిరక్షణ కోసం మన ప్రణాళికలు, దృక్పథాన్ని కూడా సరికొత్తగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని మన వారసత్వంతో అనుసంధానించడం, దానిని భావితరాలకు అందించడం ఈ దిశగా అత్యంత కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.
కాశీ నగరమే భారతీయ జ్ఞాన సంప్రదాయపు తెగిపోయిన వారధిని మళ్లీ కలుపుతుందని, అక్కడి నుంచే జ్ఞాన ప్రవాహం దేశమంతా వ్యాపిస్తుందనే పూర్తి నమ్మకం ఉందని డా. అగ్నిహోత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi