హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)
రాబోయే రోజుల్లో కేంద్ర రైల్వే శాఖ
మంత్రిగా నేనే..? వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుని నియమించేది కూడా నేనే..! అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైతుల పరిహారం కోసం అవసరమైతే.. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతానని ఆయన హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం సంగెం కలాన్ వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఆ గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం వహించడానికి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు