హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)*
నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ ఆలీ మస్కతి మరియు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకురాలు శ్రీమతి షకీలా రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గారు వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వీరు ఈ సందర్భంగా ప్రకటించారు. వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు