మెదక్, 14 అక్టోబర్ (హి.స.)
నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా
నాయకులను డీసీసీకి ఎంపిక చేయడమే లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా దుబ్బాక పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తుల స్వీకరణకు ముఖ్య అతిథిగా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నేరుగా మాట్లాడుతూ.. అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని, ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో స్థానిక నేతలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు