139 కోట్ల విలువగల భూమిని కాపాడిన హైడ్రా..
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బద్వేల్, ఉప్పర్ పల్లి గ్రామాల్లోని జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2లలో ఆక్రమణలకు గురైన 4 పార్కు స్థలాలకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని
హైడ్రా


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బద్వేల్, ఉప్పర్ పల్లి గ్రామాల్లోని జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2లలో ఆక్రమణలకు గురైన 4 పార్కు స్థలాలకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ 1, || పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయిు.

రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను, రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande