అమరావతి, 16 అక్టోబర్ (హి.స.)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ) నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. నవంబర్ 14, 15న విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రావాలని లండన్లోని పారిశ్రామికవేత్తల్ని సీఎం కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుంకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ