ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో విస్తృత తనిఖీలు
జోగులాంబ గద్వాల, 8 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖ
పోలీస్ తనిఖీలు


జోగులాంబ గద్వాల, 8 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు

నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను నిలిపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టి వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. అలాగే వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. మూడు షిఫ్ట్లలో 24గంటల పాటు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనదారులు 50 వేల రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదు. అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళుతున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలి. ఓటర్లలను ప్రలోభపెట్టే సరైన ధృవ పత్రాలు లేని నగదు మద్యం వస్తువులను సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande