అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)
,:రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. బుఽధవారం ఆయన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాల్సిందిగా క్లబ్ ప్రతినిధులు అప్పాజీ, సతీశ్ బాబు, నారాయణ తదితరులు కోరారు. 2018లో ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి.. రాజధాని నిర్మాణంలో పురోభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ