
నారాయణపేట, 13 నవంబర్ (హి.స.) అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. గురువారం ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఆయా వార్డులు తిరిగి సమస్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు రోగులకు వైద్య చికిత్సలు సకాలంలో అందించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు