ఆపదలో అండగా సీఎం సహాయనిధి : ఎమ్మెల్సీ విట్టల్
అదిలాబాద్, 19 నవంబర్ (హి.స.) ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఈ పథకం ఆపద సమయంలో సంజీవనిలా పని చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు లబ్ధిద
ఎమ్మెల్సీ విటల్


అదిలాబాద్, 19 నవంబర్ (హి.స.)

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా

పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఈ పథకం ఆపద సమయంలో సంజీవనిలా పని చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వేలాది మంది పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande