
అమరావతి, 20 నవంబర్ (హి.స.)
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది. అన్నదాతలు వాట్సాప్ వేదికగా ఇచ్చే వివరాలతో కొను గోలు స్లాట్ బుక్ కానుంది. వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే రైతుల ధాన్యా న్ని కొనుగోలు నుంచి వారి ఖాతాల్లో డబ్బు లు జమ అయ్యేవరకు సాంకేతిక బృందం పర్యవేక్షణ కొనసాగనుంది. ఓ వైపు కొను గోలు కేంద్రాలను తెరుస్తూనే, మరో వేదిక గా వాట్సాప్ సేవలను కూడా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ