
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బెంగళూరు 22 నవంబర్ (హి.స.)
బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో పైలట్గా పనిచేస్తున్న యువతిపై అదే సంస్థలో పైలట్గా పనిచేస్తున్న వ్యక్తి బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు బెంగళూరు హలసూరు పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటలో ఓ ఏవియేషన్ సంస్థలో యువతి(26)తోపాటు రోహిత్ శరణ్(60) కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సంస్థకు చెందిన పని నిమిత్తం ఆమెతోపాటు అతడు బెంగళూరు వెళ్లాడు. అక్కడ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమె అక్కడి నుంచి పారిపోయి నగరానికి చేరుకుని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రోహిత్ శరణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన బెంగళూరు హలసూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరగడంతో కేసు అక్కడికి బదిలీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ