
ముంబై, 29 నవంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. రెండు రోజులుగా మళ్లీ ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు అందకు రెట్టింపుగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజు తులంపై రూ.700లకుపైగా పెరిగింది. అదే వెండిపై రూ.3000 వరకు పెరిగింది. రెండు రోజులుగా రెండి ధరపై పెరుగుదలను పరిశీలిస్తే ఏకంగా రూ.7000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం నవంబర్ 29వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,760 ఉంది ఇక వెండి ధర కిలోకు రూ.1,83,100 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,910 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,760 వద్ద ఉంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,760 వద్ద ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,760 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV