పంచాయతి ఎన్నికలపై శబరిమల అంశం ప్రభావం చూపదు: సీఎం పినరయి విజయన్
కన్నూర్, 11 డిసెంబర్ (హి.స.) కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ (Final phase of polling) ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలైన త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోళికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్లలోని
cm-pinarayi-vijayan


కన్నూర్, 11 డిసెంబర్ (హి.స.)

కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ (Final phase of polling) ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలైన త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోళికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్లలోని 604 స్థానిక సంస్థల పరిధిలో ఉన్న 12,391 వార్డులకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ కన్నూర్ లోని తన సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక రాజకీయ ప్రకటనలు చేశారు. ప్రజలు తమ కూటమి అయిన ఎల్‌డీఎఫ్‌ (LDF)కు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF)కు బలమైన స్థావరాలుగా పరిగణించబడే ప్రాంతాలు సైతం ఇప్పుడు ఎల్‌డీఎఫ్‌ను ఆమోదిస్తున్నాయి అని ఆయన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande