
వికారాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..