
,
అనంతపురం, 15 డిసెంబర్ (హి.స.) :అనంతపురంజిల్ల )కేంద్రంలోని తపోవనం సర్కిల్లో వై జంక్షన్ రాబోతోంది. ప్రస్తుతం 44వ జాతీయ రహదారి.. కర్నూలు నుంచి అనంతపురం మీదుగా కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్పోస్టు వరకు 261 కిలోమీటర్ల పొడవునా ఫోర్లేన్గా ఉంది. ఆ స్థానంలో సిక్స్లేన్గా విస్తరణ పనులు చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఫోర్లేన్ రోడ్డు నిర్మాణ సమయంలోనే సిక్స్లేన్కు అనుగుణంగా స్థలసేకరణ దాదాపు పూర్తి చేశారు. దీంతో ప్రస్తుతం స్థల సేకరణ సమస్య తలేత్తే అవకాశం లేదు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ