
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
సైబరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర
చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేసారు. గుజరాత్ నుంచి పసి పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక బృందాలు గుజరాతకు చెందిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని గుర్తించగా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి పసి పిల్లలను రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో గుజరాత్ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు