
నిర్మల్, 24 డిసెంబర్ (హి.స.)
ఖానాపూర్ నియోజకవర్గంలో నీటి
పారుదల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ద్రుష్టి కి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో బుధవారం ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మత్తులపై, అడవి ప్రాంతాల ద్వారా ప్రవహించే కాల్వల మరమ్మతులకు అటల్ శాఖ అధికారుల అనుమతుల ఇబ్బందులను ఎమ్మెల్యేకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు