
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
మరో రెండు రోజుల్లో దేశంతో పాటు
హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక వేడుకులకు ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ పార్టీల నిర్వాహకులు, ఫబ్లు యువతను ఆకర్షించే విధంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి నగరంలోని అనేక పబ్బుల (Pubs)పై ఈగల్ టీమ్ పంజా విసిరింది. ఈ క్రమంలో క్వెక్ ఎరీనా పబ్ (Quake Arena Pub)లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానం వచ్చిన యువకులకు టెస్టులు చేసింది. దీంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. న్యూఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేస్తున్న తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు