
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
సామర్లకోట, : రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, నగరాలకు రైలు ప్రయాణం ద్వారా వెళ్లడానికి ప్రధాన కేంద్రం సామర్లకోట జంక్షన్. ఇక్కడ నుంచి రోజుకు సుమారుగా 110 నుంచి 130 వరకు రోజువారీ, వారాంతపు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు 7 మండలాలకు ప్రయాణికులు ఈ స్టేషన నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. పేరుకు ముఖ్యమైన హాల్ట్ అయినా ఇక్కడ పలు ప్రధాన రైళ్లు ఆపకపోవడంతో రాజమహేంద్రవరం, తుని, విశాఖపట్నం వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ