
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల
సమావేశాలలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి గురించి పలు ప్రశంలు లేవనెత్తారు. తెలంగాణలో సింగరేణి ప్రధానమైన సంస్థ అని అయినప్పటికీ సింగరేణి కార్మికుల్లో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుందన్నారు. వీటిని పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. లేదంటే సింగరేణి పూర్తిగా కనుమరుగయ్యి, ప్రయివేటు పరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు