గద్వాల కలెక్టరేట్లో ప్రజావాణి.. 82 ఫిర్యాదుల స్వీకరణ
జోగులాంబ గద్వాల, 29 డిసెంబర్ (హి.స.) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించ
గద్వాల కలెక్టర్


జోగులాంబ గద్వాల, 29 డిసెంబర్ (హి.స.)

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ... సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande