
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ .. తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో తన మొదటి స్పీచ్లో ప్రజా సమస్యలపై మాట్లాడారు. 'నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. గత రెండు ఏళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం తన పేరును ప్రస్తావించారు. రెండేళ్లలోపే తోటి సభ్యుడిగా సభలో రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సూచన సలహాలతో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు పోవడానికి కృషి చేస్తాను. ఈ సందర్భంగా సభ మర్యాదలను పాటిస్తూ సభను గౌరవిస్తూ ముందుకు వ్యాఖ్యానించారు. సాగుతాను' అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు