
సిద్దిపేట, 29 డిసెంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా జగదేవపూర్
మండలం పీర్లపల్లి శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతులు పీర్లపల్లి గ్రామానికి చెందిన దేవి యాదగిరి (58) మన్నె ముత్తమ్మ(55)లుగా గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు