
అమరావతి, 30 డిసెంబర్ (హి.స.):వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన్ని తెలుగు వారు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ