
అమరావతి, 30 డిసెంబర్ (హి.స.)
అమరావతి: ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ను రద్దు చేయాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ