విజయవాడ, 10 మార్చి (హి.స.)
, హైదరాబాద్: తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం టీజీపీఎస్సీ వెల్లడించనుంది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల