తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
దంపతులు సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో ఈ సందర్భంగా అందరికి దయాకర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపి, శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్