విజయవాడ, 10 మార్చి హైదరాబాద్, హిమాయత్నగర్, : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన 330 మంది గ్రూప్-4 ఉద్యోగులకు, వర్సిటీ అధికారుల మధ్య కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) లొల్లి మొదలైంది. సీపీఎస్లో యాజమాన్య వాటా జమ చేయకుండా కేవలం తమ వేతనాల్లోంచే డబ్బు తీసుకోవడం సమంజసం కాదని, పైగా సీపీఎస్ను ఎల్ఐసీతో అనుసంధానం చేయడం తమకు ఇష్టం లేదంటున్నారు. తమకు మొత్తం జీతం ఇవ్వాలంటూ అధికారులను 3 నెలల నుంచి అభ్యర్థిస్తుంటే వేతనాలు ఇవ్వడం లేదన్నారు. సీపీఎస్, వేతనాల విడుదల అంశాలపై ఓయూ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల