తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.)
నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడాన్ని అధికారులు మానుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అధికారులను హెచ్చరించారు.
రాంగోపాల్పేట, నల్లగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఫుట్పాత్ వ్యాపారులు, జీహెచ్ఎంసీ షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారు సోమవారం నాడు వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో తలసానిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు అద్దెలు పెంచుతామని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేద వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్