తెలంగాణ, కామారెడ్డి. 10 మార్చి (హి.స.)
కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని నూతన ఎస్పీ వెల్లడించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్