మధ్యప్రదేశ్, 10 మార్చి (హి.స.)
సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి
288 ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది
మంది అక్కడిక్కడే మృతి చెందారు.
అలాగే మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన
సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారి మాట్లాడుతూ.. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదంలో
దాదాపు 13 మంది గాయపడ్డారు. కనీసం ఎనిమిది మంది మరణించారు. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..