తెలంగాణ, 10 మార్చి (హి.స.)
యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవిధంగా చక్రతీర్థ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహ వద్దకు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్ద.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంపై స్వామివారి మాడ వీధుల గుండా స్వయంభు పంచనరసింహస్వామి వారి దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలకు వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్