అమరావతి:, 11 మార్చి (హి.స.) రాజధాని అమరావతి ) నిర్మాణానికయ్యే ఖర్చు రూ.64,721 కోట్లని ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ () తెలిపారు. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలో టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని రాజధానిని సీఎం డిజైన్ చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల